25, ఆగస్టు 2015, మంగళవారం

Hardwork is like stairs
and luck is like lift........
Sometimes lift may fail
but stairs will always take you to the to
నువ్వు మారుతీ కారులో వెళ్ళినా , బి ఎం డబ్ల్యు లో వెళ్ళినా
నువ్వు ప్రయాణం చేసే రోడ్డు మారదు
నువ్వు ఎకానమీ క్లాస్ లో వెళ్ళినా , బిజినెస్ క్లాస్ లో వెళ్ళినా
నువ్వు చేరవలసిన గమ్యం మారదు
నువ్వు రోలెక్స్ పెట్టుకున్నా , టైటాన్ వాచ్ పెట్టుకున్నా
సమయం మారదు
నువ్వు ఆపిల్ ఫోన్ వాడినా , లావా ఫోన్ వాడినా
నువ్వు మాట్లాడే వ్యక్తి మారడు
విలాసవంతమైన జీవితాన్ని కలలు కనొచ్చు
సాకారం చేసుకోవచ్చు
కానీ నీ అవుసరాలు ( నీడ్స్)
అత్యాశ గా మారకుండా చూసుకో !

22, ఆగస్టు 2015, శనివారం

ఈగవాలిన వేగాజారేడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు

21, ఆగస్టు 2015, శుక్రవారం

19, ఆగస్టు 2015, బుధవారం

avoid saying thease words
కుల సమాజం...............చదువుకోకముందు కాకరకాయ అన్నవాడు,చదువుకున్న తరువాత కీకరకాయ అన్నాడట!అలావుంది నేటి పరిస్థితి.కులాల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది.మా కులం గొప్ప అంటే,మా కులం గొప్ప అని కొట్టుకుంటున్నారు.ఒక 50 సంవత్సరాలకు పూర్వం ఈ కులాల కుమ్ములాటలు లేవు.ఎవరి కులం మీద వారికి అభిమానం ఉండవచ్చు.అది దురభిమానం కాకూడదు.అర్హుడు కాని తమ కులం వాడిని అందలం ఎక్కించి,అర్హుడైన ఇతర కులంవాడిని అణగతొక్కటం అనేది పెద్ద అవినీతి.ప్రస్తుతం దేశంలో నడుస్తున్న చరిత్ర ఇది.ఈ కులదురభిమానులలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం ఆశ్చర్య పరుస్తుంది.విశ్వవిద్యాలయాలలోని ప్రొఫెసర్లలో కూడా ఇది దారుణంగా ఉన్నట్టు తెలిసి విస్తుపోయాను.కులానికొక రాజకీయ పార్టీ,కులానికొక కుహనా నాయకుడు!ఆ రాజకీయ నాయకుడిని గుర్తించకపోతే,ఆకులం వారినందరినీ అవమానించినట్లుగా అతను ప్రచారం చేసుకుంటున్నాడు.నిజానికి ఏ కులానికీ ఎవరూ ప్రతినిదులు కారు .గత అన్నిఎన్నికలలో నమోదైన పోలింగ్ సరళిని పరిశీలిస్తే సామాన్య ప్రజలు ఈ 'కులపతులను' ఎక్కడా ఆదరించిన దాఖలాలు లేవు.కులందాక ఎందుకు-మతానికి కూడా ప్రజలు పట్టం కట్టలేదు.హిందూ మతాన్ని దత్తత తీసుకున్నట్లుగా మాట్లాడే బిజెపికి ఈ దేశంలోని అత్యధిక మతస్తులైన హిందువులు మొండిచెయ్యి చూపించి తమ గొప్పతనాన్ని, మత సహనాన్ని ఎన్నో సార్లు చాటుకున్నారు.చూడబోతే,శ్రీ రాముడు కూడా సెక్యులర్ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నవాడనిపిస్తుంది.కాకపొతే, ఎన్నోదెబ్బలు తిని కఠిన శిక్షను అనుభవించిన రామదాసుకు శ్రీ రాముడు కనపడలేదు.ఆ దర్శన భాగ్యం తానీషాకు కలిగింది. కారణాన్ని విశ్లేషిస్తే, రామదాసు ప్రభుత్వ ధనాన్ని(ప్రజలకోసం వినియోగించవలసిన ధనాన్ని)దుర్వినియోగ పరచి శ్రీ రాముడికి గుడి కట్టించి,తన బాధ్యతను పూర్తిగా విస్మరించాడు.తానీషా,తన కర్తవ్యనిర్వహణలో భాగంగా రామదాసును ఖైదీగా బంధించాడు.అలా,తన కర్తవ్యాన్ని అమలు పరచటం వల్లనే అతనికి రామదర్శనం అయ్యింది.కర్తవ్యాన్ని విస్మరించిన రామదాసుకు ఆ దివ్య దర్శన భాగ్యం కలుగలేదు.'శ్రీ రామదాసు' సినిమాలో నాటకీయత కోసం దర్శకుడు మరొక విధంగా చూపించి ఉండవచ్చు.భగవంతుని దృష్టిలో కులంలేదు, మతంలేదని పై సంఘటన తెలియచేస్తుంది.ఎన్ని రధయాత్రలు చేసినా రాముడు బిజెపి వారిని కూడా ఏ మాత్రం కరుణించలేదు. బహుశా:ఇప్పుడు వారికి 'రామతత్వం'అర్ధమయ్యి, రాముడి ఊసు కూడా ఎత్తటంలేదు.ఇంక కులాల సంగతికొస్తే, కులానికొక దేవుడిని కూడా సృష్టించుకున్నారు.ఈ దేశపు ప్రధమ సత్యాగ్రహి అయిన శ్రీ వాసవీ మాతను వైశ్యులకు పరిమితం చేసారు.సంస్కర్త అయిన వీరబ్రహ్మేంద్రస్వామిని విశ్వబ్రాహ్మణులకు పరిమితం చేసారు.తేటతెలుగు కవి,హేతువాది అయిన వేమనను రెడ్డి కులస్తులకు పరిమితం చేసారు.గీతాచార్యుడు,జగద్గురువు అయిన శ్రీ కృష్ణుడు మా కులస్తుడని యాదవులు చాటుకుంటున్నారు. లాలూప్రసాద్ కొంతకాలం అధికారంలో ఉన్నప్పుడు,బీహార్ లో ఆయన పెద్ద పెద్ద కటౌట్లు కృష్ణుడి రూపంలో వెలిసాయి.శ్రీ కృష్ణుడికీ ఆయనకు అసలు పోలికే లేదు.కృష్ణుడు వెన్నతింటే,ఈ మహానుభావుడు గడ్డికరిచాడు.ఎక్కడో,ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయితే, గుంటూరులో ఆయనకు అభినందనలతో పెద్ద పెద్ద బానర్లను కట్టి, ఆయన కులస్తులు ఉత్సవాలు చేసారు. మొన్ననిన్నటి దాక కృష్ణదేవరాయలు మావాడే అని ప్రచారం చేసుకున్నారు కాపు,బలిజ నేతలు.ఇప్పుడు ఆయన కులం మీద పెద్ద వివాదం చెలరేగుతుంది.యాదవులు ఆయన తమ కులస్తుడనే వాదనను తెరపైకి తెచ్చారు.కర్ణాటక ప్రభువు,ఆంద్రభోజుణ్ణి కూడా ఈ 'కులకలకలం' వదిలి పెట్టటంలేదు. నవయుగచక్రవర్తి,కవికోకిల శ్రీ జాషువాను కుల  సమాజంబ్రతికినంతకాలం కులదురహంకారులు మానసింగా హింసించి,విశ్వకవిని ఒక 'దళిత'కవిగా చేసారు.ప్రభుత్వాలకు ఇవి పట్టవు.నాలుగు ఓట్లు వస్తాయంటే,వాళ్ళను పట్టించుకుంటారు. లేకపోతే వాళ్ళ ముఖం కూడా చూడరు. గాయత్రి సేవాసమితి అంటే బ్రాహ్మణ సంఘం,వాసవీ యూత్ అంటే వైశ్య యువ జనసంఘం,వేమన యూత్ అంటే రెడ్డి కులసంఘం, కాకతీయ యూత్ అంటే కమ్మజన సేవాసంఘం..ఇలా ప్రతి కులంవారు వారి వారి అస్తిత్వాన్ని చాటుకోవటానికి కులాలమధ్య సం'కుల' సమరాన్ని సృష్టిస్తున్నారు.వీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఏమీ ఉండవు.వాళ్ళ కులపు సినీ హీరో సినిమా విడుదలైన రోజు వారికి పెద్ద పండుగ!అంతకు కాకపొతే, కార్తీకమాసంలో వనభోజనాలకు విహారంగా వెళ్లి వస్తారు.నాకు తెలిసినంత వరకు వీరు చేస్తున్న ఒకే ఒక సామాజిక సేవ వివాహ సంబంధాల కోసం Marriage Links ను ఏర్పాటు చెయ్యటం. స్థూలంగా చెప్పాలంటే ఇదీ కుల సంఘాలు చేస్తున్న సామాజికసేవ.ఇక కులనిర్మూలన సంఘాలని కూడా ఉన్నసంగతి మీకు తెలిసిందే.వీరు చేసే సామాజిక కార్యక్రమాలు కూడా పెద్దగా ఏమీ లేవు.కుల నిర్మూలన కోసం వీరు చేసిన,చేస్తున్న నిర్మాణాత్మకమైన పనులు పెద్దగా లేకపోవటం విచారకరం.మరీ విడ్డూరం ఏమిటంటే,దసరా పండుగ రోజున ఒక టీవీ ఛానెల్ లో ఒక కులనిర్మూలన సంఘ నాయకుడు కొత్త వాదాన్ని వినిపించాడు. రామాయణంలోని తాటకి, శూర్పణక,రావణుడు....వీరందరూ దళిత ప్రజలని ,ద్రవిడ ప్రతినిధులని-అందుచేత వాళ్ళను ఘోరంగా చిత్రీకరించారని ఆయన వాదన.ఈ దేశానికి నాగరికత నేర్పిన ఆదికావ్యం వ్రాసిన వాల్మీక మహర్షి ఒక ఆటవికుడనే సంగతే ఆయన మరచిపోయాడు.రాను రాను,ఈ కులగజ్జి దేశమంతా(దేహమంతా) పూర్తిగా వ్యాపించి దేశం,దేహం కలుషితం కాకుండా చూసుకోవటానికి మనమందరమూ సమాయత్తం కావాలి,కంకణం కట్టుకోవాలి.ఎవరో వచ్చి ఈ కుళ్ళిపోయిన దేహాన్ని పరిశుభ్రపరచరు. మనదేహాన్ని,అలాగే దేశాన్ని మనమే పరిశుభ్రపరుచుకోవాలి!

గోదావరి తీరంలో నోరూరే అమృత ధారలు
డా. జి వి పూర్ణచందు
రాజమహేంద్రి నుండి, కోనసీమ వరకూ విస్తరించిన భూభాగం గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటిది. తెలుగు సంస్కృతి అనగానే చేయెత్తి చూపించే నేల అది. గోదావరి డెల్టా రూపొందటానికి ముందే దానికా ప్రశస్తి ఉంది. నన్నయ నడిచిన పుణ్యభూమి, జగన్నాథ పండితుడికి జన్మనిచ్చిన సీమ, వీరేశలింగం సంస్కరణలు, శ్రీపాద కథలు, చిలకమర్తి ప్రహసనాలు, ప్రకాశంగారి నాటక ప్రదర్శనలకు వేదికైన పసిడినేల ఇది! కాటన్ మహాశయుడు అభివృద్ధికి బాటలు వేసిన హరిత వనం ఇది.
గోదావరి జిల్లాల వంటకాలలో తెలుగుదనం రంగరించి ఉంటుంది. తాపేశ్వరం కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, పల్లెసీమల్లో పరిమళించే అరిసెలు, సున్నుండలు, బొబ్బట్లు, బూందీ లడ్డూలు, కజ్జికాయలు, పొంగడాలు, గోరు మిఠాయిలు (గవ్వలు), పంచదార చిలకలు ఒకటేమిటీ గోదావరి పరీవాహక ప్రాంతం అంతా ఘుమఘుమలు, మధురిమల మయంగా ఉంటుంది. ఆస్వాదించ గలిగే మనసుండాలి అంతే!
పనసుపొట్టు కూర: గోదావరి పేరు చెప్పగానే, పనసపొట్టు పొరటు (కూర) మనసులో మెదుల్తుంది. విస్తారంగా పనస పండే ఇతర ప్రాంతాల్లో లేని ప్రత్యేకత ఇక్కడి ‘పనసపొట్టు కూర’లో కనిపిస్తుంది. ఆవపెట్టి వండటమే ఆ ప్రత్యేకత! “గోదావరి నీళ్ళు కొద్దిగా శీతవాతం చేస్తాయి, వాతహరంగా ఉంటుందని, ఆవపిండినీ, మెంతి పిండినీ కలిపి కూరలు చేస్తారు” అని పెద్దలు ఇందుకు ఒక కారణం చెప్పారు! వాతవ్యాధులున్నవారికి తరచూ ఆవపెట్టిన కూరలు మంచి చేస్తాయని దీని భావం.
పులిహోర: గోదావరి జిల్లాల్లొ పులిహోర రుచిలో కొద్దిగా ఘాటు కూడా ఉంటుంది. పులుపు, కారం, ఉప్పుతో పాటు, తీపి కోసం బెల్లాన్ని, వగరు-చేదుల కోసం కొద్దిగా ఆవపిండిని కూడా కలపటం వలన ఈ ‘గోదావరి పులిహోర’ ఆరు రుచుల్తో తియ్యగా, పుల్లగా, ఘాటుగా, ఘుమఘుమ లాడుతుంది.
కాజాలు: గోదావరి జిల్లాలకు పేరుతెచ్చిన మరో భక్ష్య విశేషం కాజా! మడతల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే అమృత పాకం ‘తాపేశ్వరం కాజా’కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. దీన్ని తయారు చేసిన పోలిశెట్టి సత్తిరాజు గారు నిజంగా అమరులే! వీటిని ‘కాకినాడ కాజా’ అని కూడా అంటారు. పొరుగు జిల్లాల్లో విందు భోజనాలకు ఈ కాజా లేనిదే బాజా భజంత్రీలు మోగవు.
తరవాణి: గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో ఒకప్పుడు తరవాణి అన్నం ముఖ్యమైన ఉపాహారంగా ఉండేది. ప్రొద్దున్నే చలిదన్నం(చద్దన్నం)గా దీన్ని తినేవాళ్ళు! శుచిగా స్నానం చేసి, అన్నం వార్చిన గంజిని ఒక కొత్త కుండలో పోస్తారు. రుచి కోసం ఉప్పు, సువాసన కోసం దబ్బాకులు వేస్తారు. ఈశాన్యం మూల ఒక కుదురు పైన ఆ కుండ నుంచి మూకుడుతో మూసి గుడ్డతో వాసెన కడతారు. కుండ వెనక గోడమీద గుండ్రంగా పసుపు పూసి, పైడమ్మ ముఖం గీసి, కుంకుమబొట్టు పెడతారు. ఇలా తరవాణికి పవిత్రతను ఆపాదిస్తారు. ఉదయం నుండీ రాత్రివరకూ ఆ కుండలోని గంజి పులుస్తూ ఉంటుంది. రాత్రి పూట అన్నం కరుళ్ళు ఆ ద్రవంలో వేసి మళ్ళీ వాసెన కడతారు. మర్నాడు ఉదయం ఆ అన్నాన్ని గట్టిగా పిండి అందులో పెరుగునో, మజ్జిగనో, ఆవకాయనో కలుపుకుని తిని, ఆ ‘తేటద్రవాన్ని’ తాగుతారు. ఆ తేటద్రవమే ‘తరవాణి’! ఇవి వేసవిలో అమిత చలవ నిస్తాయి. శ్రోత్రియులు కూడా అనుష్ఠానాలు ముగించుకుని, వడకొట్టకుండా ‘తరవాణి అన్నం’ తిని, ‘తరవాణి’ త్రాగేవారు.
ఈ తరవాణి కుండని కొన్ని రోజులు అలానే కదల్చకుండా ఉంచితే బాగా పులిసి ఆల్కహాల్ శాతం పెరిగి అది ‘బీరు’ తో సమానం అవుతుంది. దాన్ని, సీసాల్లో పోసి ఉద్యోగస్తులైన తెల్లదొరలకు సరఫరా చేసి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఓ కోనసీమ వ్యాపారి లక్షాధికారి అయ్యాడని ఇప్పటికీ చెప్పుకుంటారు. యుద్ధకాలంలో బీరు దొరక్క, ఆ ఎండలకు తట్టుకోలేని బ్రిటిష్ వాళ్ళు ఈ తరవాణికి అలవాటు పడ్డారు. ఒక రోజు పులిసినంత మాత్రానే తరవాణిలో ఆల్కహాల్ తయారు కాదు. కాబట్టి, అది మాదక ద్రవ్యం అవదు. ఆల్కాహాల్ మానేయాలనుకునే వారు ఈ తరవాణి అన్నాన్ని, తరవాణిని పరిమితంగా తాగుతూ ఆ దురలవాటు లోంచి క్రమేణా బయట పడవచ్చు. ప్రయత్నించటం మంచిది.
తెలంగాణా సల్లచారు: తెలంగాణా గోదావరి తీరంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో సల్లచారు ప్రసిద్ధి. ఆంధ్రగోదావరి తీరంలో చల్లపులుసు లేదా మజ్జిగ పులుసు అంటారు. వండే విధానంలో ఈ రెండింటికీ కొంత తేడా ఉంది.
ఆంధ్రగోదావరి ప్రాంతంలో మజ్జిగపులుసుని ఇలా తయారు చేస్తారు: మజ్జిగలో కొద్దిగా శనగపిండి, ఉప్పు, కారం వేసి సన్నసెగన పొయ్యిమీద ఉంచి ఉడకబెడతారు. నానబెట్టిన శనగపప్పు, కొబ్బరి, అల్లం, ధనియాలు, మిరియాలు తగినంతగా తీసుకుని గట్టిగా రుబ్బి చిన్న ఉండలుగా చేసి తెర్లుతున్న ఆ మజ్జిగలో వేసి, కొద్ది సేపు ఉడకనిస్తారు. దీన్ని తేమనం అని కూడా పిలుస్తారు. ఇందులో వేసే ఉండలకు తిమ్మనలు అనే పేరుంది. ఉండలు చేయకుండా ఆ మిశ్రమాన్ని మజ్జిగలోనే కలిపి, అదనంగా వంకాయ, బెండకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి, ఉల్లిపాయల ముక్కల్ని విడిగా ఉడికించి ఈ మజ్జిగలో కలిపి తెర్లబెడతారు.
తెలంగాణా సల్లచారు ఇందుకు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి పెద్దల్ని సంప్రదించినప్పుడు కొన్ని వివరాలు తెలిశాయి. మజ్జిగలో పసుపు, శనగపిండి బాగా వేగిన ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి మిశ్రమం వీటిని కలిపి సన్నసెగన ఉడక నిస్తారు. శనగపిండితో ఉండలు చేసి, నూనెలో వేయించి వాటిని ఉడికే మజ్జిగ పులుసులో కలుపుతారు. ఇదీ సల్లచారు. దీన్ని బజ్జీ మజ్జిగ పులుసు అనికూడా అంటారు. పచ్చిమిరప బజ్జీల్ని కూడా కొందరు కలుపుతారు.
మజ్జిగని ఉడికించకుండా కూడా సల్లచారును తయారు చేస్తారు. చిక్కటి మజ్జిగలో పచ్చిమిరప, కొత్తిమీర సన్నగా తరిగి, ఉప్పు తగినంత కలిపి పక్కన ఉంచాలి! నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి ఒక ఇనుప గరిటలోకి తీసుకుని, వేయించి ఆ వేడిగరిటని చల్లలో ముంచి మూత పెడతారు. చుయ్యిమనే శబ్దం వస్తుంది. అందుకే తాలింపును తిరగమూత, తిరగమోత పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర గోదావరి ప్రాంతంలో దీన్ని చల్లచారు లేదా మెంతిచారు లేదా మెంతిమజ్జిగ అంటారు. వెల్లుల్లికి బదులుగా వాముని నలిపి మజ్జిగలో కలుతారు. తిరగమూత ఈ మెంతిచారుకు ప్రత్యేక రుచిని ఇస్తుంది.
అప్పడాలు: గోదావరి తీరంలో అప్పడాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అన్నంతో పాటుగా తినే అప్పచ్చులనవచ్చు! ఇవి ఆకలిని, జీర్ణశక్తిని పెంచి, భుక్తాయాసం రాకుండా చేస్తాయి. పొట్టు తీసిన మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, లేదా ఉలవ లతో అప్పడాలు చేస్తారు. ధాన్యపు పిండిలో ఉప్పు, పసుపు, ఇంగువ సర్జక్షారం కలిపి అల్లం+ వెల్లుల్లి రసంతో బాగా మర్దించి అప్పడాలు వత్తుతారు. మిరపకారం గానీ, నూనె గానీ రంగులు గానీ, ఇంకా ఇతర విషరసాయనాలు గానీ లేని ఈ అప్పడాలు సైనికుడి చేతిలో కత్తీ, డాలు మాదిరి ఆరోగ్యాన్ని కాపాడతాయి. సన్నసెగన కాల్చి, నెయ్యి రాసి, అన్నంలో విడిగా గానీ, కూర-పప్పు-పులుసు-పచ్చళ్ళతో గానీ తింటారు. వీటి స్థానంలో నూనెలో వేయించే మద్రాసు అప్పడాలు వచ్చి, ఇవి క్రమేణా కనుమరు గౌతున్నాయి.
తెలంగాణా గరిజలు: ఆంధ్రగోదావరి తీరంలో వీటిని కరిజలు అనీ, కరిజ- కర్జి- కజ్జి కాయలు అనీ పిలుస్తారు. తీపి వంటకం. నువ్వుల పప్పుతో కొందరు, వేరుశనగపప్పుతో కొందరు వీటిని తయారు చేసుకుంటారు, కొందరు గసగసాలపొడి కూడా కలుపుతారు.
పాలతారికలు: బియ్యపు పిండిని చిక్కగా కలిపి చక్రాల గిద్దలో వేసి కాగుతున్న పాయసంలో లావుగా చక్రాలు వత్తుతారు. ఏలకుల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్మిస్సులు ఈ పాలతారికలకు అదనపు శోభనిస్తాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రసిద్ధ వంటకం ఇది. అమిత బలకరం తృప్తినిస్తాయి. ఆప్యాయతను కలిగిస్తాయి.
ఉక్కెర: ఉక్కెర అనగానే, “చక్కెర-ఉక్కెర పెడతాను, నీకాలికి గజ్జెలుకడతాను” అని పాతకాలం పాట గుర్తొస్తుంది. ఇప్పుడీ వంటకం దాదాపుగా అదృశ్యమైపోయింది. కాగుతున్న తియ్యని పాలలో మెత్తని బియ్యపు పిండి కొద్దికొద్దిగా వేస్తూ చిక్కబడే వరకూ కలుపుతూ నెయ్యి వేసి వండిన వంటకం ఉక్కెర. యాలకుల పొడి పచ్చకర్పూరం వగైరా సుగంథ ద్రవ్యాలు, నేతి ఘుమఘుమలతో నోరూరించే ఈ చక్కెర-ఉక్కెరను ఆస్వాదించాల్సిందే! బలకరం. పుష్టినిస్తుంది. కొత్త అల్లుళ్లకు ప్రత్యేక లాభాలు కలిగిస్తుంది. రంగులు, ఎస్సెన్సు వేసి తయారు చేసిన బజారు హల్వాల కన్నా ఈ తెలుగు ‘ఉక్కెర’ చక్కనైనది కదా!
తిమ్మనం: “రమ్మన్నారు తిమ్మన బంతికి”అంటారు. విందుభోజనంలో తిమ్మనం ఉంటే రమ్మన కుండానే వెళ్ళాలనిపిస్తుంది. నీరుపోసి, చిక్కగా కలిపిన బియ్యప్పిండిని మందపాటి వస్త్రంలో వేసి వడగట్టితే చిక్కని పాలలాంటి ద్రవం దిగుతుంది. బెల్లం పాకంలో ఈ పిండిపాలను కలిపి యాలకులు వగైరా సుగంథ ద్రవ్యాలు కలిపి తయారు చేసిన పాయసం ఇది. పాలు లేకుండా కాచిన ఈ పాయసాన్ని ‘తిమ్మనం’ అన్నారు. ఇది బాగా చలవ చేసే వంటకం. బలకరం కూడా!
పాఠోళి: గోదావరి తీరంలో పెద్దవాళ్లని అడిగితే చిన్నప్పుడు తాము తిన్న పాఠోళీ వివరాలు చెప్పారు. పాఠోళి అంటే ‘పప్పులతో వండి పొరటిన తెలుగు వంటకం’ అని నిఘంటువుల్లో కూడా ఉంది. శనగపప్పుని నానబెట్టి రుబ్బి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర కలిపి ఉండలు కట్టి వాసెన మీద ఉడికించి, చల్లారాక పొడిపొడిగా నలుపుతారు. సాతాళించిన పెసరపప్పుని ఇందులో కలిపి ఈ మొత్తాన్ని భాండీలో నెయ్యివేసి తడి పోయే వరకూ వేయిస్తారు. ఇది తెలుగు వారి పాఠోళీ. గుజరాత్, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పాఠోళీ వండుతారు గానీ, దాని పద్ధతి వేరు. గోదావరి జిల్లాల్లో పాఠోళీ శనగపప్పు, పెసరపప్పు కలగలసి ఘుమాయిస్తుంది. రుచుల్లో కొత్తదనం కావాలంటే, ఈ ‘పాతమాధుర్యాల్ని’ కొత్తగా వండటం నేర్వాలి!
పాలకాయలు: బియ్యప్పిండిలో తగినంత పంచదారపొడి, మెత్తని ఉప్పు, కొద్దిగా వాముపొడి కలిపి వెన్నపూస, వేడినీటితో ముద్దగా చేస్తారు. ఈ ముద్దని లోపల ఖాళీగా ఉండేలా గొట్టాలు చుడతారు. ఆ గొట్టాల్ని దోరగా నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి. పాలను బాగా ఉడికించి తీసిన కోవా(పాలగుజ్జు)ని ఈ గొట్టం లోపలికి ఎక్కించి, పిండితో గొట్టాన్ని మూసి తిరిగి నూనెలో వేయిస్తారు. ఇవి పాలకాయలంటే! వీటికి దుగ్ధకూపికా అనే సంస్కృతం పేరుకూడా ఉంది. స్వీట్లంటే బెంగాలీ స్వీట్లేననే అభిప్రాయంలోంచి బయటకొస్తే మనవైన కమ్మదనాలు ఇలా చాలా కనిపిస్తాయి.
లప్పలు: ఒక రూక ఖర్చు పెడితే లక్ష్మణవఝుల వారింట దొరికే పదార్థాలలో శ్రీనాథుడు లప్పల్ని కూడా పేర్కొన్నాడు. ఆ రోజుల్లో లక్ష్మణవఝులవారి ఇల్లు ఒక బ్రాహ్మణ భోజన హోటలు. ఒక రూక ఇస్తే ఈ హోటల్లో కప్పురభోగి వంటకం, కమ్మని గోధుమపిండి వంటకాలు, గుప్పెడు పంచదార, నాలుగైదు నంజులు(పచ్చళ్ళు), కొన్ని లప్పలు, తియ్యని క్రొంబెరుగు ఇన్ని వడ్డించేవారట! ఆ “రూక భోజనం” ముందు మన నక్షత్రం హోటళ్ల భోజనం సరిపోలదేమో!
ఇంతకీ ఈ లప్పలేమిటీ? లప్ప అంటే ముద్దలాంటిదని! రవ్వ కేసరినో, హల్వానో విసట్లో ముందుగా వడ్డించినట్లే, 600 యేళ్ళ క్రితం లక్ష్మణవఝులవారి హోటల్లో లప్పల ముద్దలు వడ్డించేవారన్నమాట! ముందుగా పాలు పంచదార కలిపి మరగ కాయగా మిగిలిన కోవా(పాలగుజ్జు)ని పక్కన ఉంచుకోవాలి. నేతితో దోరగా వేయించిన గోధుమ లేదా బియ్యపు పిండిలో, ఈ పాలగుజ్జునీ, యాలకులు వగైరా సుగంథ ద్రవ్యాల్నికలిపి, మందపాటి బిళ్లలు లేదా ముద్దలుగా చేసి, ఆరబెడతారు. ఇవే ‘లప్ప’లంటే! భోజనంలో ఇవి నాలుగైదు వడ్డించే వాళ్ళన్నమాట. రంగులు, విష రసాయనాలు, కోక్ లాంటి మాదక ద్రవ్యాలు కలిసిన ‘స్టారుచాక్లేట్ల’ను పిల్లకు పెట్టటం కన్నా ఇలా లప్పలు చేసిపెట్టటంలో మాతృప్రేమ కనిపిస్తుంది కదా!
ఈ రోజుల్లో విస్తట్లో కొద్దిగా ఉప్పు వడ్డిస్తుంటే, ఆ రోజుల్లో గుప్పెడు పంచదార వడ్డించారు. జీవితం ఇప్పటికన్నా అప్పుడు నాణ్యమైన దనటానికి ఈ ఉదాహరణ చాలు!
సర్వపిండి: తెలంగాణా గోదావరి తీరంలో సర్వపిండి అనే వంటకం ప్రసిద్ధి. ఉప్పు, ఉల్లి, పచ్చిమిరప, అల్లం వీటిని ముక్కలుగా తరిగి నానబెట్టిన శనగపప్పు, తగినంత బియ్యప్పిండి కలిపి, వేణ్ణీళ్ళు చాలా కొద్దిగా పోసి ముద్దగా చేస్తారు. అరిటాకు పైన గాని బాదం ఆకు పైన గానీ లేదా పాలకవరు లాంటి మైనపు కాయితం పైన గానీ కొద్దిగా నూనె రాసి, ఈ ముద్దని దాని పైన ఉంచి వ్రేళ్ళతో గుండ్రంగా నొక్కుతారు. పిండి అంటకుండా వ్రేళ్ళకూ నూనె రాసుకుంటారు. ఇలా ఒత్తిన అట్టుని పెనం మీద గానీ మట్టి మూకుడు పైన గానీ కాలుస్తారు. దీన్ని ఆంధ్ర గోదావరి తీరంలో ‘మండెగ’ అంటారు. ఒక తప్పాల (వెడల్పాటి గిన్నె)ను పొయ్యిమీద బోర్లించి, అడుగు నుంచి మంట అందిస్తారు. గిన్నె పైభాగాన ఈ అట్టుని ఉంచి కాలుస్తారు. మండెగలతో, క్రొన్నేతితో భోజనాలు చేయటం గురించి శ్రీనాథుడు వర్ణించాడు. మండ, మండక అనే పేర్లుకూడా గోదావరి జిల్లాల్లో వ్యవహారం ఉంది. బళ్ళారిలో వీటిని చేయటానికి ప్రత్యేకంగా పొయ్యిలు ఉన్నాయట! ఒక విధమైన తండూరి ప్రక్రియలో కాల్చిన రోటీ ఇది. ఇతర ప్రాంతాల్లో వీటిని ‘తప్పాల చెక్కలు’ అంటారు. గుజ్జుగా కాచిన గోక్షీర పూరంబు అంటే పాలలో తడి ఆరిపోయేవరకూ కాచిన పాలగుజ్జు (క్రీము)ని రెండు మండెగల మధ్య పూసి తయారు చేసిన స్పెషల్ వంటకం ‘జమిలిమండెగ’ (బర్గర్)లను కూడా శ్రీనాథుడు వర్ణించాడు. బట్టర్ నాన్ లాంటి వంటకం ఇది. కానీ, దీన్ని తినటానికి అనవసరమైన కర్రీలు అవసరం లేదు. ఇవి ఆకలి తీర్చి సంతృప్తినిస్తాయి. స్థూలకాయం పెరక్కుండా చేస్తాయి. చలవనిస్తాయి.
తెలంగాణా కొరివి కారం: కొరవి లేదా కొరివి అనే మాట “ఫైర్‘బ్రాండ్” లాంటిది. కొరివిచీమ, కొరివిదయ్యం "కొరివితో తలగోరు కొనువారు గలరే" లాంటి ప్రయోగాలు- తీవ్రమైనది, తీక్షణమైనది అనే అర్ధంలో కనిపిస్తాయి. కొరివికారం అలాంటిది. పండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు, ఇంగువ, కొద్దిగా మెంతిపండి కలిపి రుబ్బితే అది కొరివి కారం, నోరు మండుతున్నా, కడుపులో మండుతున్నా భయపడకుండా ఇష్టంగా తినే ఆహార పదార్ధం ఇది. దీన్ని ఎప్పటికప్పుడు ఇవతలకు తీసి ఉల్లి, కొత్తిమీర కలిపి తాజాగా తాలింపు పెట్టి వెన్నపూసతో తింటారు.
పొట్టెంకలు: తెలుగు వారంతా ఇడ్లీలు వండుకుంటారు. కానీ, కోనసీమ వారు పనస ఆకుల దొన్నెల్లో ఇడ్లీ పిండిని ఉంచి ఆవిరిమీద ఉడికించి తయారుచేస్తారు. ఈ దొన్నెల్ని ‘పొట్టెంక బుట్టలు’ అంటారు. పొట్టెంక(కొట్టెంక అనికూడా అంటారు) బుట్టల్లో వండిన ఇడ్లీలు(పొట్టెంకలు) భలే రుచిగా ఉంటాయి. పనస ఆకుల కారణంగా సుగంథ భరితంగా ఉంటాయి. వివాహ విందుల్లో ఇది గౌరవ నీయమైన వంటకం అక్కడ! శ్రావణ బహుళ అమావాస్య నాడు ‘పోలాల అమావాస్య’ అని ఒక పండగ చేస్తారక్కడ! కంద మొక్కకి పూజచేసి కథ చదివి అక్షింతలు వేసుకుని ఈ పొట్టెంకల్ని నైవేద్యం పెట్టే ఆచారం అక్కడుంది.
పూతరేకులు: నున్నటి కుండను బోర్లించి, దాని మూతి భాగానికి దగ్గరగా పెద్ద రంధ్రం చేసి అందులో కట్టెలు పెట్టి వెలిగిస్తారు. ఆ కుండే పొయ్యిగానూ, పెనంగా కూడా ఉపయోగపడుతుంది. ఆ కుండ పై భాగాన, ఒక రోజు పులిసిన అట్లపిండిని ఉల్లిపొర అంత పలుచగా అట్టు పోసి మడకుండా కాలుస్తారు. ఇలా తయరైన రేకులకు పంచదార పొడిని నెయ్యి వేసి కలిపి పలుచగా పూసి మడతలు వేస్తారు. పూతరేకు లంటే ఇవే! ఆత్రేయపురం వీటి తయారీకి ప్రసిద్ధి. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, ఆకివీడుల్లో కూడా ఇవి బాగా తయారౌతాయి.
ములక్కాడ పాయసం: ఎవరికీ రాని ఆలోచన వచ్చినప్పుడే కదా ప్రత్యేకత నిలుస్తుంది. కోనసీమకు అలాంటి ప్రత్యేకత ఎప్పుడూ ఉంది. ములక్కాడల పై తోలుని చెక్కి, ముక్కలు పాలలో వేసి పాయసం తయారు చేస్తారు. దాని రుచి వర్ణనాతీతం. ములక్కాడలు బాగా దొరికే సీజన్లో దీన్ని ప్రయత్నించి చూడండి. మళ్ళీ మళ్ళీ వండుకుంటారు.
గోదావరి జిల్లాల వారు ఏది వండినా ఇతర ప్రాంతాల వారికన్నా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. అన్ని రంగాలలోనూ ఆ ప్రత్యేకతను చాటుకోవాలనే తపన ఆ నీరు తాగిన వారిలో సహజం. ఆ ప్రత్యేకత గుణాత్మకంగా, ఆచరణాత్మకంగా మాత్రమే కాదు, అనుసరణియంగా కూడా ఉంటుంది. గోదావరి తీరంలో అమృత ధారలు నోరూరిస్తూ ఉంటాయి.
ఆవకాయ: గోదావరి జిల్లాల వారు ఆవకాయ పెట్టినా అందులోనూ ప్రత్యేకతే! ఆవపిండి, ఉప్పు, మెంతులతో పాటు తురిమిన బెల్లం కలిపి కొద్దిగా నూనె వేసి ఈ మిశ్రమాన్ని మామిడి ముక్కలకు పట్టించి, ఎండబెడతారు. ఇతరులు పులుపు, ఉప్పు, కారాలకు ప్రాధాన్యం ఇస్తే, ఈ “గోదావరి ఆవకాయ” తీపి, వగరు, చేదుని కూడా తనలో ఇముడ్చుకుని ఆరు రుచుల అద్భుత ఆహార పదార్ధం అవుతోంది. కాయావకాయ ఇంతకన్నా గమ్మత్తుగా ఉంటుంది! మామిడి కాయని గుత్తి వంకాయ మాదిరి ముక్కలు విడిపోకుండా నాలుగా పక్షాలుగా కోసి, ఆవపిండి ఉప్పు వగైరా కలిపిన పిండిని గుత్తికాయలో కూరి, మూడు రోజులు ఊరనిస్తారు. అప్పుడు నూనెపోసి జాడీలో భద్రపరుస్తారు. అతిథులకు ప్రత్యేకం ఈ `కాయావకాయ’.
తెలంగాణా సకినాలు: ఆంధ్రగోదావరి తీరంలో వీటిని మణుగుపూలు అంటారు. బాగా నానిన బియ్యాన్ని తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించాలి. ఈ పిండిలో దోరగా వేయించిన నువ్వుపప్పు, వాము, ఉప్పు కూడా వేసి నీళ్ళు పోసి ముద్దగా కలపాలి. సన్నని బలపాల్లాగా చేసి, ఒక బట్టపైన ఈ బలపాన్ని గుండ్రంగా రెండుమూడు వలయాలుగా చుట్టి, కొద్దిగా తడి ఆరాక నూనెలో వేయిస్తారు. ఇవి నిలవుంటాయి. బలకరం, జబ్బు చెయ్యవు. పిల్లలకు పెట్టదగిన ఆహారం.

16, ఆగస్టు 2015, ఆదివారం

నా జీవితం లో కొన్ని పదాలు లేకుండా ఏమైపోయాయి??
పొద్దున్న లేస్తూనే బెదిరించే గడియారం లేదు
...ఇంటి పక్కనే ఆఫీస్ కదా...
టెన్షన్ ,స్ట్రెస్స్, మానసిక వొత్తిడి అస్సలు లేవు
ఉన్నా ఓ పువ్వో,ఎగిరే పిట్టో,నీలిరంగు ఆకాశమో కంటపడితే చాలు
మనసు గాల్లో ఎగురుతుంది...
ప్రకృతిని మించిన రిలాక్షేషన్ వేరే ఉందా ??
మనశ్శాంతి లేదంటూ చాలా నిట్టూరుస్తారు...
నా లోపలెప్పుడూ శాంతి గానే ఉంటుంది...
నేను చేసే పని నాకు మనశ్శాంతినిస్తుంది...
కష్టాల్లేవా...కన్నీళ్ళేవా...ఎందుకుండవు?
గుండె కొట్టుకున్నంత సేపు సమస్యలే కదా....
అభద్రత ఎందుకు లేదు నాకు...ఎందుకుండాలి ....
ప్రపంచానికి జరిగేదే నాకూ జరుగుతుంది..భయమేల...
ఇప్పటికిప్పుడు భూకంపమొస్తే ...అందరితో పాటు నేనూ పోతాను....
జరిగేది జరగక మానదు...జరిగితీరుతుంది ....జరిగినప్పుడు చూద్దాం కదా...
ఫ్రేముల్లో చిక్కున్న వాళ్ళకి అన్నీ చిక్కులే.....
ఫ్రేముల్ని బద్దలు కొట్టి చూడు పైరగాలంత ప్రాణవాయువు....
సొంతం చుట్టూ అల్లుకుంటే చిన్న పరిధిలో ఉక్కిరిబిక్కిరి....
విశాలమైన మనసుతో విశ్వం వేపు చూడు ఒక్క సారి..
వ్యక్తి ప్రేమల్లోంచి విశ్వ ప్రేమవేపు పయనం
ఎపుడో మొదలైంది...ఎప్పుడు ముగుస్తుందో తెలియదు....సత్యవతి కొండవీటి

12, ఆగస్టు 2015, బుధవారం

ప్రశ్నించే పేద గొంతుల్ని మద్యంలో ముంచేస్తే
పడక కుర్చీ మేధావుల్ని పదవులతో కట్టేస్తే
బద్దకాల మధ్యతరగతిని టివీలకు అతికించేస్తే
హోల్మొత్తం అందరినీ భక్తి పిచ్చిలోకి తోసేస్తే
పాలకులకు సంబరం.... సంబరం....
మన భవిష్యత్ చిత్రపటం మహా అంధకారబంధురం



వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత కర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం

11, ఆగస్టు 2015, మంగళవారం

One of the penalties for refusing to participate in politics is that you end up being governed by your inferiors. ~ Plato

8, ఆగస్టు 2015, శనివారం

తిరిగిచ్చేత్తా నాన్నా//
------------------------
నే పదోక్లాసు పాసైనపుడు పైసల్లేక
నువ్ జరంతో రమిత్తూ కూడా కూడు
లేకుండా రాతిరంతా రాయుడు గారి
మెట్టపొలంలో మట్టి తట్టలు మోసేటి
కూలికెల్లి సంపాదించిన సిల్లరంతా పోగేసి
కొనిచ్చిన నల్లని పర్సునీ పర్సులోపల
నువ్వెట్టిన నీసెమటతో మాసిన నూరునోటునీ
సోసున్నంతకాలం దాస్కోమని నువ్
సెప్పిన మాటనీ ఇంకా ఇస్మరించలేదు
నేను..స్మరిస్తూనే ఉన్నాన్నాన్నా

అందుకే అకాలంగా ఆకలేసినపుడు
పర్సులో పైసాకూడా లేదని తెలిసీ
ఆదమరుపులో ఆపర్సు తెర్సి సూసిన
పతిసారీ నువ్వే కనపడతావ్ నాన్నా
నాకు నవ్వుతూ ఫొటోలో నీటుగా
నూరు నోటు మాటుగా..
అప్పుడేంటో గానీ సప్పుడే లేకుండా
ఐపోద్ది నా ఆకలంతా ఆరోజంతా.
కానీ నేనేమో ఆగకుండా మూగగా
ఏడుస్తూనే ఉంటాను ఆకలికోసమూ
కాదూ అన్నం కోసమూ కాదూ బిడ్డకై
గొడ్డులా కట్టపడిన అయ్యను సూడ్డం కోసం..
పొగిలి పొగిలి ఏడ్వగా మిగిలిన
కన్నీల్లన్నీ నాకంఠాన్నంటుకున్న
ఆపూట తలనిండా పొలమారింది నాకు
అపుడు నువ్నన్ను పలువరించావేమోనని
కలవరిస్తూ నేన్నీకు ఫోన్ చేసడిగేశా
తడబడిన నీ గొంతులోని దుఃఖపు జీరని
నా కర్ణాలినగానే మెడబడింది నాకు..
అదిన్న దగ్గర్నుంచీ కాళ్ళూకళ్ళూ ఆగక
నిన్న మనూరొచ్చినపుడు మొన్నెందుకు
నొచ్చుకున్నావని నిన్నడిగితే కన్నుకుంచెడు
కన్నీళ్ళు కార్చావ్..ఎట్టకేలకు నన్నేమార్చావ్..
నీకు తెల్వదా నాన్నా నేనూ నీ కొడుకునే
నిన్నీది నుంచి ఇంటిలోకొచ్చే ముందే
నాకన్నీళ్ళతోటే కాళ్ళుకడుక్కునొచ్చేశా..
నువ్ ఆదీ కాదూ నేనంతమూ కాదు నాన్నా
మన గాధ ఏఅవధినో ముగిసేదీ కాదు నాన్నా
నాన్నగా నువ్ చాలా ఇచ్చావ్ నాకు తిరిగిచ్చేత్తా
నేను ఉత్తచేతులతో ఎల్లేలోపులోనే మొత్తంగా..
పాతికోళ్ళొచ్చాక్కూడా పిల్లాడల్లే నువ్ నాకు
అల్లి కట్టిన ఎర్ర మొలతాడు సాక్షిగా.....
...............................‪#‎విట్టు‬!!
  • అసావరి కిట్టు ముందు నాన్న తత్వాన్ని
    జీర్ణించుకుంటే వర్ణింపగలరు
    పెదనాయన గారూ తమకూ
    ...See More
    Like · Reply · 1 · 30 mins
  • Araja Anok Naidu ఏ స్వార్ధం లేని ప్రేమ ని మనకు పంచుతుంది అమ్మ… మన నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన అవసరాలు తీరుస్తాడు నాన్న…. అలాంటి మన అమ్మ,నాన్నలకి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం …. జీవితాంతం వారికీ ప్రేమని పంచడం తప్ప…. వెల కట్టలేని వారి ప్రేమకి దాసోహమే కదా లోకమంతా….. ఒక చిన్న పల్లెటూరు లో పుట్టినా … ఎంతో కష్టపడి నా భవితని ఆనందం గా తీర్చి దిద్దిన మా అమ్మ,నాన్నలకి నా పాధభీవంధనలు
    Like · Reply · 1 · 22 mins
  • Sambasivarao Nulu అమ్మ మీద అమోఘమైన కవితలు ..సాహిత్యాన్ని.చదివాను.కానీ నాన్న మీద ఇలాంటి అద్భుత కవితలతో ,గుండెల్ని పిండే అనుబంధాల పదబంధాలతో సమాజలో నాన్నలన్దరినీ కట్టిపడె స్థున్నావ్...అద్భుతం ...కిట్టు ...!!!
    • అసావరి కిట్టు నాన్నతత్వాన్ని నిండుగా
      జీర్ణించుకున్నవాడే జీర్ణించగలడు
      పెదనాయనా
    • Sambasivarao Nulu
      Write a comment...