30, జులై 2020, గురువారం

చమత్కార పద్యం ఏకాక్షరి దాదదో దుద్దదుద్దాదీ దాదదోదూదదీదదోః | దుద్దాదం దదదే దుద్దే దాదాదద దదోऽదదః || ప్రతిపదార్థ : దాదదః =శ్రీ కృష్ణుడు,దుద్దరుత=వరముల నన్నిటిని,దాదీ=ఇచ్చువాడు, దాదదః=పాపములను దహించు వాడు,దదోః=దుష్టులను,దూదదీ = శిక్షించు వాడుదుద్దాదం = మంచి వారిని ,దుద్దే = కాపాడుట యందు ,దదదే = దీక్ష గలవాడుదదోదదః = ధర్మాధర్మములను ,దాదా = మిక్కిలిగా ,ద ద = ధరించువాడు అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడుభావంశ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.సేకరణ:-- ఆర్. వి. కృష్ణ (అనంతపురం) (వాట్స్ ఆప్ సందేశం)

28, జులై 2020, మంగళవారం

సతీసావిత్రి ఎపిసోడ్చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)సంగీతం : టి.వి.రాజుసాహిత్యం : సముద్రాల జూనియర్ గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకంఎవరీ దివ్యమూర్తి చూడగ నా పతి ప్రాణముల్గొనిపోవచ్చిన యమమూర్తి వలె నున్నాడేఓహోహోహో.. ఏమి ఆశ్చర్యమూభహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్కఅన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబుఈ అన్నుల మిన్నకెటుల గానుపించె ఐనను ప్రకాశముగాసావిత్రీ ! మానినీ ఆహ్హ్హహ్హహ్హహ్హహ్హహ్హనిర్నిమిత్త సందేహడోలాయ మానసవైఏల అట్లు దిగాలున చూచుచుంటివిసామాన్య మనీషాగోచరంబైనమద్రూప విశేషంబు గాంచియేనేనెవ్వరో యూహించి ఉండజాలుదువుఐనను వచించెదక్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపుఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాకవేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలునాలుగు మూడైన అగునుగాకపరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందుతాళము తప్పిన తప్పుగాక !చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణపలికినా అపశృతుల్ పలుకుగాకసకల లోకాల ధర్మశాసనము నమలుచేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానెవేళ తప్పక ప్రాణాలు వెలికిదీసిమోసికొని పోవుచుండు యముండ - అబలా !సావిత్రీ ! ఇదిగో నీ పతి ప్రాణంబుల్ గొనిపోవుచున్నాడఅయ్యో ! అయ్యో ! ఆ!నాథా ! నాథా !హ్హహ్హహ్హ మహిషరాజమా మరలుము పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా !సుంతయేని కరుణ మానిసుంతయేని కరుణ మానికాంతుని ప్రాణములను గొనిపోవుచున్నావా !ఆహా ! ఏమీ ఈ సాధ్వీలలామ సాహసముదుర్గమ కీకారణ్య ప్రయాసము సైతముశైవించినన్ననుసరించు ఈమె స్థైర్యము సంస్తవనీయమైననూ..అహో.. నిష్ప్రయోజనమే... కనుక.. చెప్పి చూచెదను గాకకాలు మోపిన చాలు కస్సని అరికాలుకోసుకుపోయెడి కూసురాళ్ళుఅలికిడైనను చాలు అదరి బుస్సున లేచిపడగెత్తి పైబడు పాపరేళ్ళుఅడుగుపెట్టిన చాలు ఒడలు జిల్లున లాగినరములు కుదియించు నదుల నీళ్ళుగాలి దోలిన చాలు కదలి ఘీ..యని కర్ణపుటములు ప్రేల్చెడి ముది వెదుళ్ళుపులులు సింహాలు శరభాలు పోవ పోవకటిక చీకటి కనరాదు కాలిదోవమరలిపొమ్మిక విడువుము మగని ఆశమాట వినవేల ఓ బేల మరలవేలా..ఆఆ...పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్నా వెంట రా తగదు రావలదు రా తగదు రావలదుపోపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్చీమలు దూరని చిట్టడవులలోకాకులు దూరని కారడవులలోచీమలు దూరని చిట్టడవులలోకాకులు దూరని కారడవులలోలబోదిబోమని అఘోరించినాలబోదిబోమని అఘోరించినాఫలితము సున్న మరలుము మెదలకపోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా ! ఔరా ! యమధర్మరాజా !పోవుచున్నావా !ఆహా ! ఏమి ఈ బాల అచంచల మనఃస్థైర్యమూదుర్గమ కీకారణ్య సీమలనధిగమించుటయే గాకమహోన్నత పర్వత శిఖరాగ్రమ్ముసైతమధిరోహించినన్ననుసరించుచున్నదే హొహ్హో మరియునూమరికొంచెము బెదరించి చూచెదను గాకచెప్పిన వినవు చెముడా గిముడాపట్టిన పంతము విడువవుగాచెప్పిన వినవు చెముడా గిముడాపట్టిన పంతము విడువవుగాఏమనుకొంటివి ఎవడను కొంటివిఏమనుకొంటివి ఎవడను కొంటివిసముండను పాశధరుండనుకాల యముండను ఆహ్హహ్హహ్హహ్హ...పోబేల పొమ్మికన్ పోపోబేల పోపొమ్మికన్ ఫో..ఆహో.. ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమాబేలా సావిత్రీ ఇక మానవ మాత్రులు దాటలేని బాట యిదిగోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకుఅరంఘనీయమైన వైతరణి అల్లదిఅన్నియునూ తెలిసిన ధర్మ వేదులుమీరుఇంత దూరమేతెంచి రిక్త హస్తములతో తిరిగి పొమ్మందురామరి ఏమందును... హ్మహుహు ఇదియునూ నిక్కంబుకనికరించి ఏదైనా ఒక్క వరంబునొసంగి పంపెదసాధ్వీ నీ కార్యదీక్షతకు కడుంగడు సంతసించితినీ పతి ప్రాణంబు దక్క ఏదైనామరొక్క వరంబు కోరుకొనుము ఇచ్చెదఈ యముని కర్కశ హృదయంబుకూడా కరుగుచున్నట్లున్నదిఇచ్చిన అవకాశమేల జారనీయవలెస్త్రీలకు పుట్టినింటికన్నను మెట్టినిల్లేప్రధానమని కదా ఆర్యోక్తియమధర్మరాజా ఆ! రాజ్య భ్రష్టులై అంధులైకారడవులందు కటకటంబడు మా అత్తమామలకు సరియ సరియ రాజ్య ప్రాప్తియూ నేత్ర దృష్టియూరెండునూ ఒసంగితిని పొమ్ముఆ ! వదలక వచ్చుచున్నదేఐనను ఇటువంటి వరంబులెన్ని యొసంగిననుమా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదాకనుక మరొక్క వరంబొసంగి లాలించి బుజ్జగించిఊరడించి మరలించెదసావిత్రీ అబలవన్న ఆదరంబునఒంటి వరంబొసంగుట పాడికాదని భావంభునమరొక్క వరంబీయ ఇచ్చగించితీఅదియును నీ పతి ప్రాణంబు దక్కఆ ! ఇప్పుడు దారిన పడినాడుఈ అవకాశమును మాత్రమేల పోనీయవలెకన్నవారి ఋణము తీర్చెదసమవర్తీ అపుత్రస్య గతిర్నాస్తి అనిఅలమటించు నా జనకునకుఆ! ఇక చాలు బాబోయ్ అను అటులసుతశతంబనుగ్రహించితిసంతుష్టవై మరలిపొమ్ముఒకటి నే కోరితి రెండు నీవిచ్చితిముచ్చటగా మూడవ కోర్కెచెల్లించకుండుట పాడియే ధర్మమూర్తీఊ ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదేఐనను ఆఖరి కోరికని వాపోవుచున్నది ఇచ్చి పంపెదసావిత్రీ స్వామీ అడుగుముఅదియును నీ పతి ప్రాణంబు దక్కసంతానమును చూసియైననుసంతసించు భాగ్యమును ప్రసాదింపుముప్రసాదించితిని పొమ్ము.. ఊ !ఇంకెక్కడికి పోయెదవుఏమీ ! నా పతి ప్రాణంబులీయకఅడుగు వేయలేవుఏమీ అడుగువేయలేనామహిషరాజమా.. ఊ !..ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుషయక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చిననూ..విలయ రుద్రుని ప్రళయ తాండావ ఘోష విన్ననూనెమరాపక అడుగు తప్పక తలతిప్పక ముందుకు సాగిపోవునా మహిషరాజము నేడేలనో తత్తరపాటున బిత్తరపోవుచున్నదే...హహహహహహహ..ఊ... నీవు సాధ్వీయే అనుకొంటిని ఇంద్రజాలవు కూడానాఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే ధర్మబద్ధమా... నాకు తెలియని ధర్మమాయమధర్మమునకు పైన మరొక్క ధర్మమా ఎటుల అమరులెటులైన సంతాన మందవచ్చుమనుజ లోకాన సాధ్వులు మగడు లేకపుత్రసంతాన మేరీతి పొందగలరుతమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !తమకు తెలియని ధర్మమే - ధర్మరాజా !ఆహా ! పతివ్రతా శిరోమణి యన్న వాత్సల్యంబున వచ్చియుంటినికాని ఇంతటి తెలివి గలదని తెలిసి యుండిన నేను రాక నా భటులనే పంపియుండెడివాడను కదా గతంబునకు వగచి ప్రయోజనంబేమి కనుకసాధ్వీ సావిత్రీ నీ పతి భక్తికి సమయస్ఫూర్తికీకడుంగడు సంతసించితి ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము హహహయముడంతవానినే తికమక బెట్టి గెలువజాలిన నీ చరిత చరితార్ధము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములనుభవించి తదనంతరంబున నా లోకంబున అహ్హ! కాదు కాదు స్వర్గ లోకంబున జేరితరింతురు గాక తరింతురు గాక తరింతురు గాకBy వేంకట భవానీప్రసాదు

27, జులై 2020, సోమవారం

పరిసరాలు – 15 నాలుగు పద్యముల్ కెలికి, నాకు సమాన కవీంద్రుడెవ్వడూనాలుగు దిక్కులూ వెతికినా కనరాడని నోరు జారు వాచాలురు ఎందరో కలరు; చాలును, వారికి సభ్యతా విధానాలును వంట బట్టినచొ నాణ్యత కూరును కూసు విద్యకున్!28. బంధం గట్టిగా ముడిపడాలంటే భావాల రాపిడి, మాటల మార్పిడి తప్పనిసరి. ప్రాచుర్యంకంటే పరిపక్వతకు ప్రాధాన్యతనిస్తే సమాజం ప్రభావితం అవుతుంది. ప్రతిభ ప్రశంసలను పొందడం తథ్యం. దానినెవ్వరూ ఆపలేరు! అభిప్రాయాలన్నీ మూసపోసినట్లు ఒకే విధంగా ఉండవు. విమర్శలు సహజం. వాటి వలన కసి, వాసి పెంచుకోవాలే కాని, వ్యక్తిగత దూషణలతో రచ్చకు దిగటం రచయితకు, అతని ప్రతిభకు శోభనీయదు. తన భావాలను ఇతరులు గౌరవించాలని కోరుకునే ప్రతివారూ ఇతరుల ఆభిప్రాయాలను గౌరవించడం నేర్చకోక తప్పదు! అపర కవీంద్రు లెందరొ మనందరి మధ్య విశేష రీతిలోనెపముల నెంచుచూ కవిత నిండిన గానము చేయుచుండగాఉపశమనంబు కానపడ దూరట మృగ్యముగానె ఉండగా,కపటము చాల ప్రస్ఫుటముగానగు గోచర మెంత దాచినా!29. నేడు లక్ష్మీ పుత్రులకు సరస్వతీ పుత్రులు దాసులైనారు కాబోలు! లబ్దప్రతిష్ఠుల ఆశ్రమంలో సుఖజీవులై, బోదియ నీడన కునుకుతీస్తున్న వారికి పేదల వేదనారోదన చెవిన పడదేమో! కలవరింతలో పలకరించినా ఊరట, ఉపశమనానికి మారుగా, కపటం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది!

25, జులై 2020, శనివారం

మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సంస్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీతా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగానీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా. ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె తల్లి దుశ్చింతులు దైత్యుచేఁబడిన సీతనుఁ గ్రమ్మఱ ఏలుచున్నవాడెంత విమోహి రాముఁడని ఎగ్గులు వల్కిన నాలకించి భూకాంతుడు నిందఁజెంది నిను కానలలోపల డించి రమ్మనెన్చ. ప్రతిదినమేనుఁ దొల్దొలుత పాదములంటి నమస్కరించి నీఅతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమేగతియెడమాయె నింకెపుడుఁ గాంతు భవత్పదపద్మముల్ నమశ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీసదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీపదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో...

🌺పద్యానికి పట్టాభిషేకం🌺 పద్యాలను తప్పక వినండి"లవకుశ"భారతీయ చరిత్రలో నిత్యజీవన స్రవంతిలా మమేకమైన ఒక దివ్య చరితమ్. అలాగే సినిమా చరిత్రలో సి.పుల్లయ్యగారి లవకుశ చిత్రం కూడా అజరామరం... ఈ చిత్రానికి ఘంటసాల గారి సంగీతం సుధా స్రోతస్విని. ఉత్తర రామాయణ మాధుర్యాన్ని, మహాత్మ్యాన్ని తెలిపే దృశ్యకావ్యం"లవకుశ"అయితే లవకుశ చిత్ర మాధుర్యాన్ని మరిచిపోకుండా,మరువనియ్యకుండా ఈనాటికీ ఆ చిత్రం లోని పాటలు,పద్యాలు ప్రతి తరాన్ని,ప్రతి వర్గాన్ని ఎంత సొంతం చేసుకున్నాయో తెలియజేయటానికే ఈ పోస్ట్... "ఏకోరసః కరుణ ఏవ"అన్న భావనతో కరుణరసానికి అగ్రతాంబూలమిచ్చిన మహాకవి భవభూతి సంస్కృతంలో రచించిన నాటకం"ఉత్తర రామచరితమ్"ఎంతో కరుణరసాభరితమైన ఈ ఉత్తర రామచరితను తెనుగుసేత చేసిన వారు ఇద్దరు. ఒకరు తిక్కన.మరొకరు కంకంటి పాపరాజు...ఉత్తర రామచరిత ప్రబంధ కార్యకర్త... ఇందులో సీతమ్మవారి ప్రతి కన్నీటి చుక్కలోని అంతరార్ధానికి అక్షరరూపాన్ని ఇచ్చిన మహనీయుడు కంకంటి పాపారాజు.. దీన్నే ఆధారంగా తీసుకొని లవకుశ చిత్రాన్ని ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసారు నిర్మాత శంకర రెడ్డి... మరెవరూ రాయలేనంత హృద్యంగా, అందరికీ అర్థమయ్యే భాషలో పాపరాజు తీర్చిదిద్దిన ఉత్తర రామాయణాన్ని రమణీయ దృశ్యకావ్యంగా ‘లవకుశ’లో సందర్భానికి తగినట్లు ఆయన పద్యాల్నే యథాతథంగా వినియోగించుకున్నారు. 'ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె విన్ముతల్లి...’, ‘రామస్వామి పదాంబుజంబు లెద నారాధింతునేనిన్‌ సదా...’, ‘రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి...’’ లాంటి పాపరాజు పద్యాలు వెండితెర ద్యశ్యాలకు ప్రాణంపోశాయి. ‘‘పాపరాజుగారి సీతమ్మ నిజంగా కరుణా ప్రబంధమే. బమ్మెర పోతరాజుగారంత ఆవేశంతోనూ పాపరాజుగారు రచన చేస్తారు. వారి పద్యాలు వెంటనే హృదయానికి హత్తుకుంటాయి’’ అన్నారు ఆరుద్ర. ‘‘మృదుపదవిన్యాసం, అర్థసందర్భం, రస సంపద వంటి కవితా గుణాలు ఉన్న ఉత్తమకవిత్వమ’’ని కంకంటి కవితావైభవాన్ని ప్రస్తుతించారు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి. సీతారాములిద్దరూ ధర్మప్రతిష్ఠాపన కోసం నెరిపిన ఆదర్శ దాంపత్యాన్ని, లోకకల్యాణం కోసం అనుభవించిన వియోగాన్ని ఆర్ద్రంగా అక్షరీకరించి పాఠకుల హృదయాలను కరిగించిన కవి కంకంటి పాపరాజు.. ఇక ఈ సినిమాలోని పద్యాలు లవకుశ పద్యాలుగానేప్రసిద్ధిచెందినయి.. *సేకరణ*లవకుశ పద్యాలు అంటే లవకుశులు పాడినవి కావుఁగాని లవకుశ పేరుఁగల సచ్చిత్రరాజ నిక్షిప్త పద్యాలని నా భావన. నేను విన్నవీ, వింటూన్నవీ, నా మనస్సును హత్తుకున్నవీ ఈ పద్యరత్నాలు. పైగా ఘంటసాల గారి అసదృశగాత్ర సుధారసాన్విత పద్యాధారస్వాదన నిరుపమాన భాగ్యమే కదా.మ. నవరత్నోజ్జ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయోధ్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సంస్తవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కీయెడన్భువి పాలింపు ప్రజాను రంజకముగా మోదంబుతో రాఘవా(అన్వయము = వంశము)తా. వశిష్ఠుడు రాముణ్ణి సంహాసనారూఢునిఁ జేసి పల్కిన వాక్కులివి. "నవరత్న ప్రభాజితమైన ఈ కిరీటము పూర్వము సూర్వవంశీయ రాజులు ధరించి రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలించారు. ఈ ఘనమైన కిరీటము నీవు ధరింపఁదగినది. ధరించి ఇధ్ధరను మోదముతో ప్రజామోదగా పాలింపవయ్యా రఘువంశీయుడా"ఉ. ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతిఁ జేసిరొ అట్టి తల్లి సీతా మహిళాశిరోమణిని దారుణ కానలవీధి కంపగానీ మది ఎట్టులొప్పె ఎట నేర్చితివీ కఠినత్వ మగ్రజా(సుత్రాముడు = ఇంద్రుడు, హవ్యవాహనుడు = అగ్ని)రఘువంశ కీర్తిప్రతిష్ఠలకు కళంకముఁ దెచ్చు నపవాదు ప్రజలలో వ్యాప్తము కాకమున్నె రాజ్యపరిత్యజమో, కళత్రపరిత్యాగమో చేయవలనని సంకల్పించియున్నవాడు శ్రీరాముడు. పట్టముఁ గట్టించుకొనుటకు తమ్ములెవ్వరూ ముందుకు రారయ్యె, భార్యావియోగమే మార్గమయ్యె. సీతను భగీరథీ నదతీరము వద్ద విడిచిరమ్మని లక్ష్మణుఁ నాజ్ఞాపించెను. ఆ క్షణమున లక్ష్మణుని ఆక్రోశమే ఈ పద్యముఉ. ఇంతకుఁ బూనివచ్చి వచియింపక పోదునె తల్లి దుశ్చింతులు దైత్యుచేఁబడిన సీతనుఁ గ్రమ్మఱ ఏలుచున్నవాడెంత విమోహి రాముఁడని ఎగ్గులు వల్కిన నాలకించి భూకాంతుడు నిందఁజెంది నిను కానలలోపల డించి రమ్మనెన్గర్భవతియైన సీతను, ఏమఱచియున్న అబలను అడవుల పాలుఁజేయు దుస్సహ కార్యము రామప్రియానుజుని పైబడినది. అడవిలో కీడు శంకించుచూ కారణమడిగిన సీతకు లక్ష్మణుని బదులు పద్యమిది. "ఇలాంటి ఘోరకృత్యము తలపెట్టి నిమిత్తము నీకు చెప్పకుండా ఉండగలనా? దురాలోచనా పరులైన రాక్షసుల వద్ద యుండిన సీతను తిరిగి స్వీకరించిని మోహితుడు రాముడను దుష్టనిందను విని, అపవాదు కలుగునని, అయోధ్యాధిపతి నిన్ను అడవులలో దించి రమ్మనెను"చ. ప్రతిదినమేనుఁ దొల్దొలుత పాదములంటి నమస్కరించి నీఅతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమేగతియెడమాయె నింకెపుడుఁ గాంతు భవత్పదపద్మముల్ నమశ్శతములు సేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీతా. "అనుదినము నీ పాదములకు దండము పెట్టుకుని నీ ఆశీస్సుల తీసుకొని వెడలు వాడను, ఇక అట్టి భాగ్యము నాకు దూరమవుతున్నది కావున, చివరి సారి శతనమస్కారములు స్వీకరించుమమ్మా, సీతమ్మా" అని బాధపడు లక్ష్మణుడు.ఒక్క మాటు కిష్కింధకాండ గుర్తుతెచ్చుకోండి. ఆకాశము నుండి పూర్వము ఒక స్త్రీ పడవేసిన నగల మూటను రామసౌమిత్రుల వద్దకు తీసుకువస్తారు వానరులు. ఆ అబల సీతయై యుండవచ్చునని ఊహించిన రాముని మనస్సులో పెల్లుబికిన బాధవల్ల కన్నులు చెమర్చినాయి. నగలని చూడలేక, ప్రక్కనే ఉన్న లక్ష్మయ్య చేతఁబెట్టి గుర్తించమన్నాడు. నగలను పరికించి చూచి,నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వభి జానామి నిత్యమ్ పాదాభివందనాత్అని బదులు చెప్పాడు ఆ సౌశీల్య గుణగరిష్ఠుడు. పై పద్యం వింటూంటే ఈ శ్లోకం గుర్తుకు రాదూ?అదృష్ట వశాన వాల్మీకి ఆశ్రమఛాయలకు చేరుతుంది జానకి. అత్యంతాదరణానురక్తులతో ఆశ్రమవాసులు ఆమెకు స్వాగతము పలుకుతారు. అయోనిజ దురదృష్టానికి చింత కలిగినా, ఆమెకు ఆతిధ్యమిచ్చే భాగ్యము తమదైనందుకు ఆశ్రమవాసుల ఆనందానికి అవధులు లేవు. వాల్మీకి స్వాగత వచనా లివి.చ. ఇదెమన ఆశ్రమంబు ఇచట నీవు వశింపుము లోకపావనీసదమల వృత్తినీకు పరిచర్యలు సేయుదు రీ తపశ్వినుల్ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీపదములు సోకి మా యునికి పావనమైఁ జెలువొందు నమ్మరో... చదువుతుంటేనే కళ్ళు చెమర్చటం లేదు... ఇటువంటి అద్భుతమైన పద్యాలను ఘంటసాల గారి గుండె లోతుల్లోని ఆవేదనను, ఆర్ద్రతను,ఆప్యాయతను ఇలా ఎన్నో ఫీలింగ్స్ ను ఆ గళం ఎలా పలికిందో మనందరికీ ఇప్పటికీ జ్ఞాపకమేకదా... ఆయన దారిలోనే ఏకలవ్య శిష్యుడైన ఆయన భక్తుడు ఈ తరపు ఓ గ్రామీణ యువకుడు ఎంత చక్కగా ఘంటసాల వారికి స్వరార్చన చేసాడో... ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ...అతని పేరు శ్రీనివాస్...ఇవిగో పద్యాలు...

13, జులై 2020, సోమవారం

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు #Brokers, #Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ( కొంత మంది మాత్రమే) %%%%ముందుగా Brokers చేసే మోసాలు%%%%%1) #Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే) 2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు. 3)నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే #registration office లో #EC తెస్తే తెలుస్తుంది. 300 అవుతుంది EC కి.5) కొనే ముందు original #sale #deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.6) ఎట్టి పరిస్థితుల్లో #Sale agreement ( #contract) min 3months ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్న 3Months తక్కువ వెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. #Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వల్లే #commission కోసం కకృతి పడతారు.8.) A, B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B broker కి agrement వేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ 1Lakh అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ brokers 1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు. 9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ brokers యజమాని busy గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ #address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు. మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.11) original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి. #Documents required for Property1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి. 2) All Linked Documents3) అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.5) EC - Encumbrance certificate (EC)6) #Mother deed certificate7) #RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)8.) Survey Sketch9) #Layout Approval10) #Katha Certificate11) #DC #Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion) 12) #Property Tax Certificate13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.14) #apartments ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు. వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ #commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy #paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.17) ఇల్లు కట్టి ఉంటే #building #Plan #approval ఉండాలి.18)Agrement రోజు, #Registration ముందు రోజు EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా #underground #drainage ఉన్నదా. #Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి. 21) మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.http://registration.ap.gov.in/http://registration.telangana.gov.in/....**** #Loan తీసుకొనేఅప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే మోసాలు*****1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది. Agrement time period లో మీకు loan sanction కాకుండా చేసి agreement డబ్బులు brokers, bank, owner పంచుకుంటారు.2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు. 3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది. 4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి. అందువల్ల యజమాని ఒప్పుకొడు.5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5% loan amount లో #Insurance తీసుకోవాలి . కొన్ని Banks (#DHFL) 5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో #Revenue #stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.6) Registration అప్పుడు #Bank #agent వచ్చి #check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు. Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు. 8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు ( కొంత మందికి మాత్రమే) చెప్పే మాటలు నమ్మి sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.9) #personalLoan తీసుకుంటే Processing fee ఉంటది, #Insurance optional. ముందే Insurance వద్దు అని చెప్పాలి.10) బ్యాంక్ Loan కి రెండు రకాల వడ్డీలు ఉంటాయి #fixed, #variable. #Fixed #interest ఐతే future లో వడ్డీ rates మారవు. Variable interest ఐతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీ rates మారుస్తూ ఉంటారు.11) pre Closing charges, #pre #Closing ఎన్ని నెలలు తరువాత చెయ్య వచ్చు. #Parshial #closing #charges వంటి వివరాలు తెలుసుకోవాలి.12) బ్యాంక్ వాళ్లు చెప్పిన ప్రతి మాటని #record చేసుకోండి. వాడు చెప్పిన దానిని #official mail నుంచి మీ mail కి పంపమని చెప్పండి.13) ఇప్పుడు కొంత మంది #Bank వాళ్లే పెద్ద దొంగలు, వారితో జాగ్రత్త14) బ్యాంక్ #EMI లో .. వడ్డీ + అసలు . ఉండాలి. కొన్ని దొంగ బ్యాంక్స్ వడ్డీ మాత్రమే తీసుకుంటాయి. #Principle మనం బ్యాంక్ కి వెళ్లి కట్టాలి. దొంగ rules ఇవి.15) #Land కొంటె #Income #Tax #Exception క్రింద రాదు. #House #Flat #Plot #Fraud #Mindgame #Careing #Land #Property #Bank #Brokers #Loan #HomeLoan #PersonalLoan #DHFL #IncomeTax #Registration #Documents #Brokers

3, జులై 2020, శుక్రవారం

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...🚶🏿‍♀పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚కానీ ఎందుచేతో ఈ పద్యం జనబాహుళ్యం లో లేదుకార్యేషు యోగీ, కరణేషు దక్షఃరూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః,సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలుధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)📚⚖1.కార్యేషు యోగీ 💰:పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి🏹2. కరణేషు దక్షః 🤺:-కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.🏌🏾3. రూపేచ కృష్ణః🙏:-రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,సంతోషంగా ఉండాలి.👌4. క్షమయా తు రామః🏹:-ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి5. భోజ్యేషు తృప్తః🍲🥘🍛భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.6. సుఖ దుఃఖ మిత్రం🤼‍♂:-సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.⛹🏼🎻ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు 🏇🏼ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు. 🙏🏻🙏🏻🙏🙏